TIMES NOW-ETG Research Survey: ఏపీలో ఆ పార్టీదే హవా, కూటమికి షాకేనా?; తెలంగాణలో ఇలా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలు చేస్తున్నాయి. తాజాగా, టైమ్స్నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే (TIMES NOW-ETG Research Survey) తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని తేల్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో 21-22 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక, టీడీపీ-జనసేన పార్టీలకు కలిపి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మరోసారి ఏపీలో వైసీపీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, తెలంగాణలోని 17 స్థానాలకు జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్నౌ సర్వే తేల్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8-10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక, బీజేపీకి 4-6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1-3 ఎంపీ స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
TIMES NOW- @ETG_Research Survey
— TIMES NOW (@TimesNow) April 4, 2024
Andhra Pradesh (Total Seats: 25) || Here are seat share projections-
- YSRCP: 21-22
- BJP: 0
- TDP+JSP: 3-4
- Others: 0
Watch as @navikakumar shares more details. pic.twitter.com/CdIxog58lk
దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగితా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకేకు 21-22 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా ఓపెన్ చేయని బీజేపీ ఈసారి మాత్రం 2-6 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఏఐఏడీఎంకేకు 1-3, ఇతరులకు 4-5 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
కేరళ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే..
బీజేపీ: 0-1
కాంగ్రెస్ పార్టీ: 8-10
సీపీఎం: 6-8
ఐయూఎంఎల్: 1-2
ఇతరులు: 1-2
కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే..
బీజేపీ: 21-23
కాంగ్రెస్: 4-6
జేడీఎస్: 1-2
కాగా, దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications