జూన్ 18 నుంచి జులై 9 వరకు అమెరికాలో తిరుమల శ్రీనివాసుడి కల్యాణాలు
అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన ఈవో ధర్మారెడ్డి తో కలసి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని భక్తుల కోసం శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రవాస భారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు జరగనున్నాయన్నారు.
జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగోలో, జులై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9వ తేదీన అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీనివాసుని కళ్యాణాలు నిర్వహించాలని భక్తులు విజ్ఞప్తులు చేశారని, వారి విజ్ఞప్తులను కూడా పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం భారీగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హిందూ ధర్మంవైపు అందరూ ఆకర్షితులవుతున్నారని, ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీయే అందుకు కారణమన్నారు. అమెరికాలో కల్యాణాలు నిర్వహించడం అయిపోయిన తర్వాత ఎక్కడ నిర్వహించాలనేది, ఏయే దేశాల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయనేది నిర్ణయించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications