విషాద ఛాయల్లో నరసరావుపేట: స్వచ్ఛంద బంద్: తెరచుకోని షాపులు.. విద్యాసంస్థలు!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించడానికి విషాద ఛాయల మధ్య ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులు నరసరావుపేట పట్టణానికి చేరుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచే కాకుండా.. పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నరసరావుపేటకు వస్తున్నారు. జోహార్ కోడెల అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాద్ హఠాన్మరణం చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పలువురు కార్యకర్తలు. శోక సముద్రంలో మునిగిపోయారు.
అంత్యక్రియలను దృష్టిలో ఉంచుకుని నరసరావుపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచీ పట్టణవ్యాప్తంగా గంభీరపూరితమైన వాతావరణం నెలకొంది. ఒక్క షాపు కూడా తెరచుకోలేదు. పాఠశాలలు, విద్యాసంస్థలు అనధికారిక సెలవును పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలు పెద్దగా కనిపించట్లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. కోడెల మరణం పట్ల నరసరావు పేట వాసులు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు.

ఆయనను చివరిసారిగా చూడటానికి ఆయన నివాసానికి బారులు తీరుతున్నారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలను తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- నరసరావుపేట డివిజన్ పరిధిలో మొత్తంలో రెండురోజుల పాటు 144 సెక్షన్ ను విధించారు.
మరి కొద్ది సేపట్లో కోడెల భౌతిక కాయానికి అంతిమ యాత్రను నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లాంఛనాలను కోడెల కుటుంబీకులు, టీడీపీ నాయకులు నిరాకరించిన నేపథ్యంలో.. పార్టీ తరఫునే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడెల నివాసానికి చేరుకున్నారు.

పలువురు మాజీ మంత్రులు, జిల్లా టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. అధికారిక లాంఛనాలతో కోడెల భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించేలా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. కుమార్తె, కుమారుడితో మాట్లాడుతున్నారు. వారి నుంచి సానుకూల స్పందన రాలేదని కార్యకర్తలు చెబుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications