Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ఘోర రైలు ప్రమాదం: రెండు రైళ్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగివుంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖపట్నం-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితి ఏర్పడింది. క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి.

కాగా, రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం అందడంతో ఇప్పటికే సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాయని డీఆర్ఎం తెలిపారు.

 Train accident in vizianagaram district; three killed, many injured

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఇది సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగిస్తోంది. కాగా, సిగ్నలింగ్ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

హెల్ప్ లైన్ నెంబర్లు:

రైలు ప్రమాదం నేపథ్యంలో అధికారులు హెల్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

రైలు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తన్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తపపినట్లుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు సీఎంకి వివరించారు. కాగా, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్సులను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+