కరోనాపై యుద్ధంలో టీటీడీ సైతం .. వెంటిలేటర్లు , వైద్య పరికరాల కొనుగోలుకు రూ.19 కోట్ల భారీ విరాళం
కరోనాపై యావత్ ప్రపంచం యుద్ధం చేస్తుంది . ఇక మనదేశంలోనూ కరోనాపై పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది. ఇక ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు సైతం కరోనాపై పోరుకు మేము సైతం అంటూ తమ వంతు సహకారం అందిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల ఖ్యాతికి కారణమైన , ప్రపంచదేశాల వాళ్ళు ఇష్ట దైవంగా కొలిచే కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయం అందిస్తుంది .

పద్మావతి నిలయం ఆస్పత్రిగా .. ఉదారత చాటుకుంటున్న టీటీడీ
ఇప్పటికే చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ బాధితుల కోసం పద్మావతి నిలయాన్ని ఆస్పత్రిగా మార్చేందుకు ఇచ్చిన టీటీడీ కరోనా బాధితుల కోసం వెంటిలేటర్లు , మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది. టీటీడీ తరఫున రూ. 19కోట్లు కరోనా బాధితులకు కావాల్సిన మెడికల్ కిట్లు , వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఇస్తున్నట్లు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ కోరిన మేరకు రూ.8కోట్లు చిత్తూరు జిల్లా అధికారులకు ఇచ్చామని చెప్పిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరో రూ.11కోట్లను త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు

అన్నార్థుల ఆకలి తీరుస్తూ .. నిత్యం లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ
ఇక అంతేకాదు టీటీడీ భక్తులకు దర్శనాలు కరోనా వ్యాప్తి జరుగుతుందనే భావనతో నిలిపివేసినప్పటికీ చాలా మంది అన్నార్ధుల ఆకలి తీరుస్తుంది. లాక్ డౌన్ నేపధ్యంలో తిరుమలలో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. ఎటూ వెళ్ళలేక అక్కడే చిక్కుకుపోయారు. ఇక వారిని ఆదుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. వలస కూలీలతో పాటు యాచకులను ఆదుకునేందుకు రోజుకు లక్షా 20వేల ఫుడ్ ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేస్తుంది . మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజన ప్యాకెట్లను అందిస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు .
తిరుమల కొండపై ఉన్న విశ్రాంతి గదుల్లో కొందరికి ఆశ్రయం ఇచ్చారు.
Recommended Video

లాక్ డౌన్ ముగిసే వరకు అవసరమైన సేవలు చెయ్యాలని టీటీడీ నిర్ణయం
ఇక వారికి సైతం రోజూ ఆహారం అందిస్తున్నారు. ఆకలితో అలమటిస్తోన్న వారి జీవితాలను టీటీడీ అధికారులు తమ ఉదారత చూపి కాపాడుతున్నారు.లాక్డౌన్ ముగిసేవరకు తాము భోజన ప్యాకెట్లను నిత్యం పంపిణీ చేస్తామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఇక అంతే కాదు తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయని, కేవలం భక్తుల దర్శనాలు మాత్రమే నిలిపివేశామని అధికారులు చెప్తున్నారు. తిరుమలపై జరిగే దుష్ప్రచారాలు నమ్మవద్దని వారంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications