మాజీ ఉద్యోగులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్, 200 ఎకరాలకు స్కెచ్, భూమన !
తిరుపతి/తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన సీఎం జగన్ తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రారంభిస్తారని, అదే రోజు టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణి చేస్తారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు చెప్పారు.
శుక్రవారం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. టీటీడీ ఉద్యోగులతో పాటు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేసే ప్రసక్తే లేదని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు.టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, శ్రీనివాస సేతు, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను శుక్రవారం మధ్యాహ్నం అధికారులతో కలసి భూమన కరుణాకర రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరు 18వ తేదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అంతకు ముందు తిరుపతి నగరం సిగలో మరో మణిహారం కాబోతున్న శ్రీనివాససేతు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.
సుమారు రూ. 650 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై 19వ తేదీ నుండి వాహనాల రాకపోకలు అనుమతిస్తారని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. యాత్రీకులు, స్థానికులకు కూడా శ్రీనివాస సేతు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు కొందరికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేస్తారని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుంటారని భూమన్ కరుణాకర రెడ్డి తెలిపారు. సుమారు 400 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ను దర్శించే వారని భూమన కరుణాకర రెడ్డి అన్నారు.

తమది అభివృద్ధి, ఆధ్యాత్మిక, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పునరుధ్ఘాటించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగ స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications