టీటీడీ చైర్మన్గా పుట్టా, మెంబర్గా రాయపాటికి ఛాన్స్, సభ్యులు వీరే..
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. టీటీడీ బోర్డు సభ్యులను కూడా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా రాయపాటి సాంబశివ రావు, ఎమ్మెల్యేలు జీఎస్ఎస్ శివాజీ, బోండా ఉమామహేశ్వర రావు, అనిత, పార్థసారథి, చల్లా రామచంద్రా రెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణా రెడ్డి, డొక్కా జగన్నాథంలకు అవకాశమిచ్చారు.

తెలంగాణ నుంచి ఇద్దరికి, కర్నాటక, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. తెలంగాణ నుంచి సండ్ర వెంకట వీరయ్య, ఇనుగాల పెద్దిరెడ్డికి చోటు దక్కింది. కర్నాటక నుంచి సుధా నారాయణమూర్తి, మహారాష్ట్ర నుంచి స్వప్నకు చోటు దక్కింది.
టీడీడీ బోర్డులో సీనియర్లకు పెద్ద పీట వేశారు. చాలాకాలంగా చైర్మన్ పదవి ఆశిస్తున్న రాయపాటికి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు కూర్పు జరిగింది. జిల్లాల రాజకీయ సమీకఱణలలో భాగంగానే శివాజీ, బోండా ఉమ, అనిత, పార్థసారథిలకు అవకాశం దక్కింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రుద్రరాజు పద్మరాజుకు పదవి దక్కింది. సండ్ర వెంకట వీరయ్యకు మరోసారి అవకాశం ఇచ్చారు. సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డికి అవకాశం వచ్చింది.
-
తిరుమలకు పెరుగుతున్న రద్దీ వేళ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..!! -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
తిరుపతిలో బాసర తరహా అక్షరాభ్యాసం - ప్రత్యేకంగా కిట్లు, మార్గదర్శకాలు..!! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications