వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: స్త్రీ హత్య కేసులో భర్తే

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని డోనేకల్లు గ్రామానికి చెందిన వివాహిత కురబ సిద్ధమ్మ (28)ను హత్య చేసి కాల్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఉరవకొండ సిఐ ఎలమరాజు తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని సిఐ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

డొనేకల్లు గ్రామానికి చెందిన సిద్ధమ్మ అక్టోబర్ 12వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి గాదిలింగప్ప 31వ తేదీ విడపనకల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే అక్టోబర్ 11వ తేదీ సిద్ధమ్మ, ఆమె భర్త లక్ష్మిరెడ్డి గొడవ పడ్డారని, దీంతో ఆమె అదే రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు.\

Two arrested in woman murder case

తిరిగి ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త లక్ష్మిరెడ్డి, ఆమె తమ్ముడు శివలింగ ఆమె కోసం కలిసి గాలించారు. సిద్ధమ్మకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ శివారు ప్రాంతంలో కనిపించిన సిద్ధమ్మకు లక్ష్మిరెడ్డి, శివలింగ మాయమాటలు చెప్పి కర్నూలు జిల్లాలోని టి.సాకిబండ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చివేశారు.

సంఘటనా స్థలంలో సేకరించిన ఎముకలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నామని, హత్యకేసులోని నిందితులు లక్ష్మీరెడ్డి, శివలింగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సిఐ తెలిపారు.

English summary
Two accused arrested in married woman murder case at Uravakonda in Ananthapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X