విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్: ఇద్దరు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఎస్ఎమ్ఎస్-2లో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు అనీష్, రజనీష్ మృతి చెందినట్లు సమాచారం. సోమవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ఎస్ఎమ్ఎస్-2 విభాగంలో కార్బన్‌డైయాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు ఇంజనీర్లు ఊపిరి అందక మృతి చెందినట్లు తెలియవచ్చింది.

పలు ప్రమాదాలు ఎస్ఎమ్ఎస్-2లోనూ, ఇతర విభాగాల్లో జరుగుతున్న ప్రమాదాల పట్ల రక్షణ చర్యలు సక్రమంగా లేకపోవడంవల్లే జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నప్పటికీ యాజమాన్యం దీనిపై స్పందించడంలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

Two dead in Visakha steel plant accident

అయితే ఇప్పటివరకు ప్లాంట్ అధికారులు జరిగిన ప్రమాదంపై అధికారికంగా స్పందించలేదు. ఇద్దరు ఇంజనీర్లు మృతి చెందిన విషయం కూడా కార్మికులు చెప్పారు తప్పితే యాజమాన్యం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

రామకుప్పం వద్ద ఎమ్మెల్యేల కార్లు ఢీ

చిత్తూరు జిల్లా రామకుప్పం హెలిప్యాడ్ వద్ద చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. సత్యవేడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యేల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లకు చెందిన ఇద్దరు డ్రైవర్లకు స్వల్పంగా గాయాలయ్యాయి.

English summary
Two engineers dead in Visakha steel plant accident. The accident took place due the leakage of gas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X