రాఖీ కట్టించుకుంటామని పిలిచి నిర్బంధించి ఇద్దరిపై గ్యాంగ్ రేప్
అనంతపురం: రాఖీ కట్టించుకుంటామని చెప్పి కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులపై అనంతపురం జిల్లా యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కల్లూరు జడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులపై అనంతపురం యువకులు అత్యాచారం జరిపారు.
ఆ విద్యార్థినులను అనంతపురం జిల్లా వజ్రకరూర్కు తీసుకువెళ్లి ఐదు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశారు. రాఖీలు కట్టించుకుంటామని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. యువకుల బారి నుంచి తప్పించుకున్న విద్యార్థినులు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి, మహిళా సంఘాలు మండిపడ్డాయి. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
రౌడీషీటర్పై దాడి
ఇదిలావుంటే, విశాఖ నగరంలో రౌడీషీటరు కిరణ్పై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కంట్లో కారం చల్లి, కత్తులతో వెంబడించారు. రౌడీ షీటర్ అనిల్ హత్య కేసులో నిందితుడైన కిరణ్ దుండుగుల దాడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ఆరంభించారు.