జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ... అవినీతి, అరాచకాలు , దౌర్జన్యాలు అంటూ
ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రాయలసీమ జోన్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడుపుతోంది అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో అహంకారపూరితమైన,అభివృద్ధి నిరోధక పాలన నడుస్తోందని మండిపడ్డారు.

ఏపీలో పోలీసు రాజ్యం
ఏపీలో పోలీసురాజ్యం నడుస్తుందని,అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మరీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినా పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారని, తనకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.

నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్ కూడా
గతంలో చంద్రబాబు హయాంలో కూడా అవినీతి, అసత్య పాలనే కొనసాగిందని ఇప్పుడు కూడా పరిస్థితి అదే విధంగా ఉందని మండిపడ్డారు. వైయస్ఆర్సిపి పాలనలో అవినీతి వికేంద్రీకృతమైందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలు మారినా,నిరసనలు తెలియజేసిన, ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

ఏపీలో ఇసుక, మద్యం మాఫియాలు
ఇక ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇక మొన్నటి వరకు చంద్రబాబు, ఇక ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వారే అయినా,ముఖ్యమంత్రి పదవులు దక్కించుకున్నారాయలసీమను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో వైసిపి పాలనలో ఇసుక మాఫియా ,మద్యం మాఫియా లు చెలరేగుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

వైసీపీ పాలనా లోపాలను ఎత్తి చూపిన బీజేపీ నేతలు
పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కన్నా లక్ష్మీనారాయణపేర్కొన్నారు.ఇక వైసీపీ వైఖరి మార్చుకోకుంటే ఏపీలో బీజేపీ పోరాటం సాగిస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ తేల్చిచెప్పారు. ఇక జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు బీజేపీ ముఖ్య నేతలు . ఇక అదే సమయంలో కేంద్రం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు .
-
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications