ఉపాసన మెగా డెసిషన్ - "గేమ్ ఛేంజర్"..!!
మెగా ఇంటి కోడలు ఉపాసన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సామాజిక - సేవా రంగాల్లో చురుకుగా ఉండే ఉపాసన కొణిదెల అపోలో వ్యవహారాల్లో కీలకంగా మారారు. తాత ప్రతాప్ రెడ్డితో కలిసి తమ గ్రూపు విస్తరణలోనూ ఉపాసన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు తాజాగా ఉపాసన మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయోధ్య కేంద్రంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అయోధ్య కేంద్రంగా
రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపారం - సేవా రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా అయోధ్య కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అపోలో గ్రూపు ద్వారా అయోధ్యలో ఎమర్జన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. కుటుంబ సభ్యుల తో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకున్న ఉపాసన ఎమర్జెన్సీ సెంటర్ ను ఓపెన్ చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ..ఆసక్తి కర అంశాలను జత చేసారు. అపోలో ద్వారా ఆధ్యాత్మిక కేంద్రాల్లో అందిస్తున్న సేవలను వెల్లడించారు.

భక్తుల కోసం
సనాతన ధర్మం గురించి తన తాత చాలా నేర్పించారని ఉపాసన పేర్కొన్నారు. అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం తమకు గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాత మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తు న్నామని ఉపాసన వివరించారు. తమ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రముఖ క్షేత్రాలుగా ఉన్న తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్లో ఇప్పటికే అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy.
— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024
Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.
After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61
గేమ్ ఛేంజర్
ఇక, ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఉపాసన వెల్లడిం చారు. ఉపాసన చేసిన ప్రకటన వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్.. నెటిజెన్లు సైతం ఉపాసనను అభినందిస్తున్నారు. అటు రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా ఉండనుంది. రామచరణ్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. కాగా, తమన్ సంగీతం అందించారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications