జగన్పై అందుకే కేసులు, భూమన క్షమాపణ చెప్పాల్సిందే: వీహెచ్ సంచలనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్:
వైయస్సార్
కాంగ్రెస్
పార్టీ
అధినేత
వైయస్
జగన్మోహన్
రెడ్డిపై
కాంగ్రెస్
పార్టీ
సీనియర్
నేత,
మాజీ
ఎంపీ
వీ
హనుమంతరావు
సంచలన
ఆరోపణలు
చేశారు.
జగన్ను
కాంగ్రెస్
కేసుల్లో
ఇరికించిందనడం
సబబు
కాదని,
తండ్రి
అధికారాన్ని
అడ్డు
పెట్టుకుని
దోచుకున్నందుకే
కేసుల్లో
చిక్కుకున్నారని
వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడితో మాట్లాడతానన్నారు. గురువారం గాంధీభవన్లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రాక్షసి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వీహెచ్ తెలిపారు.
Recommended Video
కరుణాకర్రెడ్డి దీనిపై క్షమాపణ చెబితేనే కాంగ్రెస్పార్టీ.. దివంగత సీఎం వైయస్సార్ జయంతిని నిర్వహించాలన్నారు. వెంకయ్యతో ఫోటోలు దిగారని దళిత ఎమ్మెల్యేలను తిట్టిన జగన్.. ముస్లిం, క్రిస్టియన్లను దూషించిన రాంనాథ్ కోవింద్ కాళ్లు మొక్కొచ్చా? అని ప్రశ్నించారు.