Vangaveeti Radha: రాజ్యసభ రేసులోకి వంగవీటి రాధా? చంద్రబాబు లెక్కలేంటి ?
ఈ ఏడాది రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్ల కోసం కూటమి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే కూటమిని నడుపుతున్న టీడీపీలో అయితే ఇది మరి కాస్త ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఇందులో సామాజిక వర్గాల లెక్కలు, స్థానిక సమీకరణాలు, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు.. ఇలా పలు అంశాలు మిళితమై కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అనూహ్యంగా మరో కొత్త పేరు రాజ్యసభ అభ్యర్ధుల రేసులోకి వచ్చింది.
రాజ్యసభకు వంగవీటి రాధా (vangaveeti radha)
కూటమికి, అందులోనూ టీడీపీకి అత్యంత ముఖ్యమైన నగరాల్లో విజయవాడ కూడా ఒకటి. ఇక్కడ స్థానికంగా కాపు రాజకీయాల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో వంగవీటి రాధా (vangaveeti radha) కూడా ఒకరు. చాలా కాలం నుంచి టీడీపీలోనే ఉంటున్నా ఆయనకు ఎలాంటి పదవీ లభించలేదు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల పంపకాల్లోనూ రాధాను పట్టించుకోలేదు. దీంతో ఇక రాధా పని ముగిసినట్లే అని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఆయన రాజ్యసభ రేసులోకి వచ్చారు.

టీడీపీలో రాజ్యసభ రేసు
ఇప్పటికే టీడీపీ నుంచి టీడీ జనార్ధన్, భాష్యం రామకృష్ణ, సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ బాబుతో పాటు పలు పేర్లు రాజ్యసభ రేసులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వీళ్లలో లోకేష్ కు సన్నిహితుడైన సానా సతీష్ ను పూర్తి పదవీకాలం దక్కకపోవడంతో కొనసాగింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో సీటుకు చంద్రబాబు వంగవీటి రాధా పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు లెక్కలేంటి ?
ఇందులో కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గర కావడం ద్వారా వచ్చే ఎన్నికల్ని సైతం నల్లేరుపై నడకగా మార్చుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వంగవీటి రాధాకు రాజ్యసభ సీటును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ రాధాను ఎన్నికల్లో ప్రచారాలకు వాడుకుని వదిలేస్తున్నారన్న అపప్రద నుంచి బయటపడి ఆయనకు పార్టీలో సముచిత స్ధానం ఇచ్చి రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రాధాను రాజ్యసభకు పంపితే విజయవాడతో పాటు మిగతా కోస్తా జిల్లాల్లో కూడా కాపులు టీడీపీకి మరింత దగ్గరయ్య అవకాశాలున్నాయని, ఇదో గేమ్ ఛేంజర్ నిర్ణయం అవుతుందని చెప్తున్నారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications