"రంగా ఇప్పటికీ హీరోనే, నువ్వేమైనా సత్య హరిశ్చంద్రుడివా?, 17మర్డర్ కేసులు"
గౌతంరెడ్డికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు.
విజయవాడ: 'రాధా, రంగా పాములాంటోళ్లని, పాములను ప్రజలు చూస్తూ ఊరుకోరు, చంపుతారు' అంటూ వైసీపీ నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యానాలు వంగవీటి వర్గంలో మంట పుట్టించాయి. రంగా అభిమానులు, ఆయన తనయుడు రాధా.. గౌతం రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ కు సిద్దమవగా.. అది కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది.
తాజాగా వంగవీటి అనుచరులు గౌతం రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. . రంగా, రాధాలపై కామెంట్ చేసిన గౌతంరెడ్డి ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? అని ప్రశ్నించారు. ఆయనపై 17 మర్డర్ కేసుల్లో ఆరోపణలున్నాయన్నారు. గౌతంరెడ్డికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు.

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాక ఎన్నికల సమయంలో ఆర్థికంగాను పార్టీ సహాయం అందించిందని గుర్తుచేశారు. కార్పోరేటర్ అయిన గౌతంరెడ్డి ఆయన స్థాయి మేరకే వ్యవహరించాలన్నారు. గౌతంరెడ్డికి రూ.300కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. సత్యనారాయణపురంలో బ్రాహ్మణుల భూములను ఆయన కబ్జా చేశారని ఆరోపించారు.
గౌతంరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమని రాధా అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. రంగా 'ఇప్పటికీ హీరోనే' అని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications