వైయస్ జగన్ కేసు: విజయ సాయిరెడ్డికి బెయిల్

హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, కేసు విషయంపై ఎవరితోనూ మాట్లాడరాదని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఒక వేళ హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. గతంలో రెండు సార్లు బెయిల్పై విడుదలైన విజయసాయిరెడ్డిని కేసు తీవ్రత దృష్ట్యా జైలుకు వెళ్లాలని కోర్టు ఆదేశించడంతో 4నెలలుగా జైల్లోనే ఉన్నాడు.
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కోర్టులో ఇంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఆరోపణలకు సంబంధించి ఏ చిన్న ఆధారాలు కూడా చూపించట్లేదని, బెయిల్ను అడ్డుకోవాలని సిబిఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని సాయిరెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి కూడా షరతులతో కూడి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందె. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, కెవి బ్రహ్మానందరెడ్డిలు మంగళవారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వీరికి సోమవారం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications