మద్యం కేసులో సాయిరెడ్డి బిగ్ బాంబ్ - ఆ మగ్గురూ 'ఫిక్స్'..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ. దీని పైన ఇప్పటికే సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఢిల్లీ లో కేంద్ర హోం మంత్రికి టీడీపీ ఎంపీ క్రిష్ణదేవరాయులు ఈ కేసు వివరాలు అందించారు. ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని ఫిర్యాదు చేసారు. ఇటు సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి సిట్ ముందు విచారణకు వస్తున్న వేళ వైసీపీ లో ఉత్కంఠ పెరుగుతోంది. సాయిరెడ్డి ఈ కేసులో బాంబ్ పేల్చేందుకు సిద్దమయ్యారనే చర్చ వినిపిస్తోంది. అటు..నోటీసులు అందుకున్న నేతలు కోర్టును ఆశ్రయించారు.
సిట్ విచారణకు సాయిరెడ్డి
లిక్కర్ స్కాం విచారణ లో భాగంగా మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ ఎదుట విచారణకు రానున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను విచారణ చేస్తే మరింత సమాచారం ఇస్తానని ఇప్పటికే సాయిరెడ్డి స్పష్టం చేసారు. కాగా, సాక్షిగా ఈ రోజు సిట్ ముందుకు వస్తున్న సాయిరెడ్డి వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను పూర్తి గా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభ కోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. సాయిరెడ్డి ఇప్పటికే ఈ కేసులో కర్మ, కర్త, క్రియ మొత్తం కసిరెడ్డి అని తేల్చి చెప్పారు.

సిట్ విచారణలో
కాగా, సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ గైర్హజారయ్యారు. అలాగే కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ఆఫ్లో ఉన్నాయి. కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబసభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఐదేళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను సంపాదించారని గుర్తించారు. ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, సినిమా తీశారని సిట్ అధికారులు గుర్తించారు. గతంలో సాయి రెడ్డి మద్యం కేసులో కసిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలని సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.
ఆ ఇద్దరికీ ఉచ్చు
ఇటు కసిరెడ్డి తనకు సంబంధం లేని విషయంలో విచారణకు ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కసిరెడ్డి తండ్రిని సిట్ విచారణ చేస్తోంది. కాగా, కసిరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇక.. వైసీపీ ముఖ్య నేత మిథున్ రెడ్డికి రేపు (శనివారం) విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అటు సుప్రీంలో రిలీఫ్ పొందిన మిథున్.. ఇటు హైకోర్టులో సిట్ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇదే కేసు లో నాడు పని చేసిన అధికారులను సిట్ విచారణ చేసింది. ఇప్పుడు సాయిరెడ్డి సాక్షిగా ఇచ్చే సమాచారంతో ఈ కేసులో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications