వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం తాకట్టు పెట్టడానికి వస్తున్నారు: చిరుపై విజయమ్మ

|
Google Oneindia TeluguNews

Vijayamma
కడప: గత లోకసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ విజయం సాధించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచారని ఆ పార్టీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. ఈ ఘనత కడప ప్రజలదేనని చెప్పారు. కడప జిల్లా ప్రజలకు తామేప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు. ఆమె కడప సర్కిల్‌లో గురువారం నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విజయమ్మ మండిపడ్డారు. 70 లక్షల మంది ఓటర్లను మోసం చేసిన చిరంజీవి, వారు గెలిపించిన 15 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఏం తాకట్టు పెట్టడానికి చిరంజీవి ప్రజల ముందుకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రానికి రూట్ మ్యాప్ ఇచ్చారని విజయమ్మ ఆరోపించారు. నేత కార్మికుల ఆత్మహత్యలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని, జనతా వస్త్రాలను రద్దు చేసి ఆప్కోలను నిర్వీర్యం చేశారని విమర్శించారు.

హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు తానే కారణమని చెప్పుకుంటున్నారని..నమ్మేవారుంటే హుస్సేన్ సాగర్, చార్మినార్‌లను కూడా తానే కట్టించానని చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు వలసలు పోయారని విజయమ్మ ఆరోపించారు. ప్రజలు ఆకలికేకలతో అలమటిస్తుంటే సింగపూర్, మలేషియా దేశాలు తిరిగొచ్చారని విమర్శించారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma on Thursday fired at Union Minister Chiranjeevi and TDP president Chandrababu Naidu and Jai Samaikyandhra Party president Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X