వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డి .. లోక్ సభా పక్ష నేతగా మిథున్ రెడ్డికి అవకాశం
వైసీపీ తరపున పార్లమెంట్లో నాయకత్వం వహించే నేతలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వైసీపీ లో జగన్ తర్వాత ముఖ్య నేతగా అందరూ భావించే , పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు జగన్. ఇక లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ, జగన్కు సన్నిహితుడైన మిథున్ రెడ్డికి అవకాశం దక్కింది. లోక్సభలో పార్టీ చీఫ్ విప్గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముగ్గురు ముఖ్య నాయకులకు పదవులను కేటాయించి ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వైసీపీ లోక్సభాపక్ష నేతగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం మిథున్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి...రాజ్యసభలో ఆ పార్టీకి నేతృత్వం వహించనున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ తమ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ను ఎంపిక చేసింది. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సుజనా చౌదరి, లోక్ సభాపక్ష నేతగా రామ్మోహన్ రావుకు అవకాశం కల్పించింది.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముగ్గురు ముఖ్య నాయకులకు పదవులను కేటాయించి ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వైసీపీ లోక్సభాపక్ష నేతగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం మిథున్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన విజయసాయిరెడ్డి...రాజ్యసభలో ఆ పార్టీకి నేతృత్వం వహించనున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ తమ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ను ఎంపిక చేసింది. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సుజనా చౌదరి, లోక్ సభాపక్ష నేతగా రామ్మోహన్ రావుకు అవకాశం కల్పించింది.

కేంద్రంతో లాబీయింగ్ చెయ్యగల నేత కనుకే విజయసాయికి అవకాశం
జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న సమయంలోనే పార్లమెంటరీ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకో లేదు. అయితే అందరూ ఎంపీలు ఆ బాధ్యతను జగన్ పైన పెట్టారు. జగన్ ఎవరిని పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకున్నా అందరికీ ఓకే అని చెప్పారు. అయితే పార్లమెంటరీ పక్ష నేతగా మిథున్ రెడ్డి పేరు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పేరు ప్రధానంగా వినిపించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడాలి అంటే కేంద్రం నుండి నిధులు తీసుకురా గలిగినవారు, కేంద్రంతో లాబీయింగ్ చేయగలిగిన వారు పార్లమెంటరీ పక్ష నేతగా ఉంటే లాభం చేకూరుతుందని జగన్ భావించారు. అందుకే హస్తినలో ఉన్న కేంద్ర ముఖ్య నాయకులతో సంబంధాలున్న విజయ్ సాయి రెడ్డి అయితే ఈ పదవికి సరిగ్గా సరిపోతాడని భావించి విజయసాయిరెడ్డికి పార్లమెంటరీ పక్ష నేతగా అవకాశం కల్పించారు జగన్.

కేంద్రంలో విజయసాయి రెడ్డి , మిథున్ రెడ్డి ఏం చేస్తారో ?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కేంద్రంలో చక్రం తిప్పగలనేతలకు, లాబీయింగ్ చేయగల నేతలకు అవకాశం ఇచ్చిన జగన్ అందుకు సమర్ధులుగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి లను భావించే అవకాశం ఇచ్చారు. ఇక ఏపీ ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపధ్యంలో మరి ఈ నాయకులు వైసీపీ సర్కార్ కు ఏ మేరకు కేంద్రం నుండి సహకారం అందేలా చేస్తారో వేచ్ చూడాల్సిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications