ఎల్లుండే.. ప్రెస్ ముందుకు సాయిరెడ్డి: బిగ్ అనౌన్స్‌మెంట్ గ్యారెంటీ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తెర మీదికి వచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మీడియా ముందుకు రాబోతోన్నారు. భవిష్యత్ రాజకీయ గమనం, కార్యాచరణ ప్రణాళికపై ఆయన కీలక ప్రకటనలు చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 1:15 నిమిషాలకు విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది.

నూతన పార్టీని త్వరలోనే ప్రకటిస్తానంటూ ఇదివరకే వెల్లడించారు సాయిరెడ్డి. దీంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పై అందరి చూపూ నిలిచింది. ఎలాంటి ప్రకటన చేయబోతోన్నారనేది ఇప్పటి నుంచే హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి కట్టాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిపోరాటం సాగిస్తోంది. వామపక్షాలు, ఇతర చిన్నా చితక పార్టీలు ఉన్నా వాటి ప్రభావం అంతంత మాత్రమే.

Vijayasai Reddy set to Hold a Press Conference in Vijayawada on September 7 to Announces New Party

ఈ పరిస్థితుల్లో ద్విపార్టీ రాజకీయాలు సామాన్య ప్రజల ఆశయాలు, వారి దీర్ఘకాలిక ప్రయోజనాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సాయిరెడ్డి చెబుతున్నారు. ఈ రకమైన రాజకీయాలు ప్రజల అభీష్టాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తెరమీదికి రావాల్సిన అవసరం ఉందంటూ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అందిపుచ్చుకున్న వైసీపీ- భారీ నిరసన: రారనుకున్న సీనియర్లందరూ ఒకే వేదికపైకి.. !!
అందిపుచ్చుకున్న వైసీపీ- భారీ నిరసన: రారనుకున్న సీనియర్లందరూ ఒకే వేదికపైకి.. !!

ప్రస్తుతం కొనసాగుతున్న సాంప్రదాయ రాజకీయ సమీకరణాలకు భిన్నంగా సామాన్య ప్రజలు మరియు వారి శ్రేయస్సును కేంద్రంగా ఉంచుకుని సాగే నూతన ప్రత్యామ్నాయం అవసరమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అవసరాలను తీర్చడం, వారి సమస్యల పరిష్కారించడమే పరమావధిగా పాలన సాగాలని అన్నారు.

విజయ్ ఏమనుకున్నా సరే..మా నిర్ణయం ఇదే: తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్
విజయ్ ఏమనుకున్నా సరే..మా నిర్ణయం ఇదే: తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్

వైఎస్సార్సీపీలో నంబర్ 2 గా, పార్టీ గళాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించిన నేతగా గుర్తింపు ఉన్న విజయసాయి రెడ్డి.. ద్విపార్టీ విధానం విఫలమైందంటూ విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమౌతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికి ఓ నూతన పార్టీని, భవిష్యత్ కార్యాచారణ ప్రణాళికలను ప్రకటించబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+