రంగంలోకి జగన్, ఇదీ విషయం!: మాజీ మంత్రికి షాకిచ్చిన వంగవీటి రాధా
విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పార్థసారథిని రంగంలోకి దించారు. గురువారం రాధతో ఆయన భేటీ అయ్యారు. టిక్కెట్ విషయమై చర్చించారు.
Recommended Video

విజయవాడ సెంట్రల్ సీటు మార్పుకు గల కారణాలు, విజయవాడ తూర్పులో పోటీ చేయమనడానికి గల కారణాలను ఆయనకు తెలిపారు. వైసీపీ అధిష్టానం తరఫున పార్థసారథి.. రాధతో చర్చలు జరిపారు. కానీ వైసీపీకు చుక్కెదురైంది. సెంట్రల్ సీటు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని, రెండో ఆలోచన లేదని రాధాకృష్ణ తేల్చి చెప్పారు.

తొందరపాటు నిర్ణయాలు వద్దు
విజయవాడ సెంట్రల్ సీటులో మరో ఆలోచన లేదని వంగవీటి రాధాకృష్ణ గట్టి షాకివ్వడంతో.. పార్థసారథి ఆయనకు పలు సూచనలు చేశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. వంగవీటి రాధాతో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన పార్టీ అధినేత వైయస్ జగన్కు తెలపనున్నారు.

అందుకే మధ్యవర్తిగా పార్థసారథి
తనకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించకపోవడంపై వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన రంగా రాధా మిత్రమండలి, తన మద్దతుదారులతో వరుసగా భేటీ అవుతున్నారు. మూడు రోజుల పాటు వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని రెండు రోజుల క్రితం అనుచరులకు సూచించారు. ఈ నేపథ్యంలో పార్థసారథి మధ్యవర్థిగా వచ్చారు.

పార్టీ మారుతారా?
సెంట్రల్ సీటును ఇప్పటికే మల్లాది విష్ణుకు కేటాయిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆయనను ఇంచార్జిగా నియమించారు. మరోవైపు సీటు విషయంలో వంగవీటి రాధా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రాధా పార్టీ మారే అవకాశాలు లేదా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన చూపు జనసేన వైపు ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు, అనుచరుల కళ్లు
అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పార్థసారథి ఆరోపించారు. అఫ్పుల కంటే ఆస్తులు ఎక్కవగా ఉన్నా సమస్య పరిష్కారం కావడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల కళ్లు పడ్డాయన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపకపోవడంపై బీజేపీ సమాధానం చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications