Vijayawada Boy : విజయవాడలో డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి-ఏం జరిగిందంటే ?
తాజాగా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుండగా మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్లో పడి చనిపోయిన ఘటన మరువకముందే ఏపీలోని విజయవాడలోనూ దాదాపు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఓ డ్రైనేజీలో పడిన ఓ ఆరేళ్ల బాలుడు నీళ్లలో కొట్టుకుపోయి ఊపిరాడక చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాలుడు గల్లంతు అయినట్లు తేలడంతో మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.
విజయవాడలో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఈ సమయంలో గురునానక్ కాలనీలోనూ వర్షం కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. గంటసేపు కురిసిన వర్షానికి మురుగుకాల్వలోనూ భారీగా నీరు చేరింది. అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు కాలుజారి నీటిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మురుగుకాల్వలోకి జారిపోయాడు. విషయం తెలియగానే మున్సిపల్ సిబ్బందికి స్ధానికులు సమాచారమిచ్చారు.

గురునానక్ కాలనీలో బాలుడు గల్లంతైనట్లు తెలియడంతో విజయవాడలో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి కిలోమీటర్ దూరంలో బాలుడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.
విజయవాడలో డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి-ఏం జరిగిందంటే ? #Vijayawada #ViralVideo #TeluguNews #Oneindiatelugu pic.twitter.com/3ylEYLCzdN
— oneindiatelugu (@oneindiatelugu) May 5, 2023
విజయవాడలో చోటు చేసుకున్న బాలుడి మృతి ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలువలపై పూర్తిస్ధాయిలో మూతలు వేయాలని పలుమార్లు స్ధానికులు విజ్ఞప్తి చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో రోడ్లపై మోకాళ్ల లోతు చేరిన నీరు కాల్వల్లోకి పోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్ధానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications