కల్తీ మద్యం దుర్ఘటన: బార్లోనే కల్తీ, మోతాదుకు మించి మిథైనల్
విజయవాడ: విజయవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణ నివేదిక సిద్ధమైంది. విజయవాడలోని స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ నివేదికను కమిషనర్ మీనా స్వయంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించనున్నారు.
బార్లోనే మోతాదుకు మంచి మించి మిథైనల్ కలిపినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. దీన్ని ఆధారాలతో నిరూపించేందుకు అధికారులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో ఆబ్కారీ సూపరింటిండెంట్ రమణ సెలవుపై వెళ్లగా, సిఐని సస్పెండ్ చేశారు.
స్వర్ణ బార్ దుర్ఘటన నేపథ్యంలో 13 మిథైనల్ యూనిటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా, పోలీసులు కాంగ్రెసు నేత మల్లాది విష్ణు బంధువుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.

కాగా, కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్రను పదవి నుంచి తప్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విజయవాడలోని ఆబ్కారీ కార్యాలయాన్ని సిపిఐ నేతలు ముట్టడించారు.
కల్తీ మద్యం ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అని వారన్నారు. స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్గేషియా ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications