పెద్దల కట్టడి: ఆమెతో మాట్లాడితే రూ.3 వేలు జరిమానా
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో ఓ దళిత మహిళకు సాంఘిక బహిష్కర విధిస్తూ తీర్మానం చేశారు. ఆమెకు గ్రామంలో సహాయ నిరాకరణ చేయాలని వారు కట్టడి చేశారు. తవణంపల్లె మండలంలోని గోవిందరెడ్డిపల్లె దళితవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియాలో వచ్చిన కథనం మేరకు - గోవిందరెడ్డిపల్లె దళితవాడకు చెందిన పుష్ప అదే గ్రామంలో 2014లో రోడ్డుకు ఆనుకుని ఉన్న 13 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. ఐ స్థలానికి ఆనుకుని 2007లో పంచాయతీ అధికారులు పశువుల దాహం తీర్చడానికి నీటి తొట్టె కట్టారు.

అప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆ నీటి తొట్టె దగ్గర దుస్తులు ఉతకడం ప్రారంభిచారు. నీటి తొట్టె సమీపంలోని తన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఆ దళిత మహిళ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, అక్కడ దుస్తులు ఉతకడంతో మురికి నీరంతా తన స్తలంలోకి వస్తోందని, ఇక్కడ ఉతకవద్దని చాలాసార్లు మొర పెట్టుకుంది.
అయినా వారు వినకపోవడంతో దళితవాడ ప్రజలకు, ఆమెకు మధ్య గొడవ ప్రారంభమైంది. గత మేనెలలో దళిత వాడలోని ప్రజలంతా మాట్లాడుకుని ఆమెకు సహాయ నిరాకరథ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో ఎవరూ మాట్లాడరాదని, మాట్లాడితే రూ.3 వేలు జరిమానా వేస్తామని కట్టడి చేశారు. ఈ విషయంపై బాధితురాలు పుష్ప ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications