విశాఖపట్టణం:ఏపీఐఐసీ సర్వేయర్ చిరంజీవి ఇంట్లో ఏసీబీ సోదాలు...భారీగా అక్రమాస్థుల గుర్తింపు
విశాఖపట్నం:రాష్ట్రంలో మళ్లీ ఎసిబి దాడుల కలకలం మొదలైంది. తాజాగా ఏపీఐఐసీ సర్వేయర్ చిరంజీవిరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో చిరంజీవి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం పది చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు చిరంజీవికి సంబంధించి జరిపిన సోదాల్లో ఆయనకు రెడ్డిపల్లిలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, భోగాపురంలో 300 గజాల స్థలం, రేవాళ్ళపాలెంలో 80 గజాల స్థలం, మురళీనగర్లో 200 గజాల్లో ఇల్లు, ఒక ప్లాట్ను గుర్తించారని తెలిసింది. ఇంకా బ్యాంకు లాకర్లు పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈయనపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
విశాఖలో అక్రమ,అవినీతి నిరోధక శాఖల వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి,పేరం గ్రూప్స్ అధినేత పేరం హరిబాబుకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపగా...తాజాగా ఏపీఐఐసీ సర్వేయర్ చిరంజీవి నివాసం పై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications