మోడీ దృష్టికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య-జగన్ కు ఉక్కు పరిరక్షణ సమితి వినతి
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుని ఏడాది దాటిపోయింది. త్వరలో పూర్తిస్ధాయిలో ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పేరుతో ఏర్పడి కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీని కలుస్తున్న సీఎం జగన్ కు ఉక్కు పరిరక్షణ కమిటీ ఓ విజ్ఞప్తి చేసింది.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాలు గమనించాలని కమిటీ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే విషయం ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కమిటీ సీఎం జగన్ ను కోరింది. సొంత గనులు లేకపోయినా లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్ ప్లైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని తెలిపింది. సీఎం జగన్ ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపడతారని కార్మికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

గత 477 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయని, గతంలో ప్రధానిని నాలుగు సార్లు కలిసిన సీఎం జగన్.. ఒక్కసారి కూడా ఆయన దృష్టికి స్టీల్ ప్లాంట్ విషయం తీసుకెళ్లలేదని కమిటీ గుర్తు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఈసారైనా స్టీల్ ప్లాంట్ సమస్యను ఆయనతో చర్చించాలని కమిటీ ప్రకటనలో కోరింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే బలమైన తెలుగు వారి ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీపై ఉందని కమిటీ తెలిపింది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications