పవన్ కళ్యాణ్ చేసే వారాహి దీక్ష ప్రాశస్త్యం ఏమిటి? పవన్ దేనికోసం దీక్ష చేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్న విషయం తెలిసిందే. జూన్ 26 నుండి 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను నిర్వహించనున్నారు. ఇక దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వారాహి దీక్ష అంటే ఏమిటి అసలు ఎందుకు చేస్తారు? చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వారాహి అమ్మవారు ఎవరంటే
వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం.. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్తమాతృకలుగా చెప్తారు. ఆమె ఏడు ప్రతి రూపాలను సప్తమాతృకలు అంటారు. దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని చెబుతారు.

వారాహి రూపమిలా
వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్న ముఖంతో ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి ఎనిమిది చేతులలోనూ శంఖువు, చక్రం, నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. ఇక వారాహి అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాలలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అసలు వారాహి అమ్మవారి ప్రస్తావనను తీసుకువచ్చి వారాహి అమ్మవారి విశేషాలను అందరూ తెలుసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ నే.
వారాహి అమ్మవారిని పూజించేది ఇందుకే
ఇక వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే శత్రువులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదని చెబుతారు. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జేష్ట మాసం చివరిలో ఆషాడమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడుతారు.
వారాహి దీక్షను పాటించాలిలా
వారాహి దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి, రెండు పూటలా అమ్మవారిని పూజ చేసుకుంటూ, సాత్విక ఆహారం తీసుకొని, నేలపై పడుకుని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరిస్తారు. సాధారణంగా వారాహి దీక్షను తొమ్మిది రోజులైనా, 11 రోజులైనా చేయొచ్చు.
పాలనకు అవాంతరాలు రాకుండా వారాహి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తాను తిరిగే ప్రచార వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టుకున్నారు. అన్ని సమస్యలను వారాహి అమ్మవారు పరిష్కరించి తిరుగులేని విజయాలను ఇస్తారని ఆయన వారాహి దీక్ష చేస్తున్నారు.
-
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!












Click it and Unblock the Notifications