ఆ సైట్లో చంద్రబాబు ఫోటోనా?: దాన్ని కూడా వదలరా.. ఎందుకిలా!
తాజాగా శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వెబ్ సైట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో దర్శనమివ్వడం ఈ విమర్శలకు తావిస్తోంది.
తిరుపతి: విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండవద్దన్న విషయం ఏపీ అధికార పార్టీకి అంతగా పట్టనట్లే కనిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలకు వర్సిటీలో చోటు లేనందునా పరోక్ష దారులు వెతికే పనిలో ఆ పార్టీ నిమగ్నమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వెబ్ సైట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో దర్శనమివ్వడం ఈ విమర్శలకు తావిస్తోంది.
యూనివర్సిటీ సైట్.. క్యాంపస్, విద్యా సంబంధిత వివరాలకు వేదికగా ఉండాల్సిందిపోయి, రాజకీయ నాయకుల ముఖచిత్రాలతో కనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవిధంగా చంద్రబాబు తరుపున ప్రచారం చేసే పాంప్లెట్ పేజీలా వర్సిటీ వెబ్ సైట్ ను భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్థి సంఘాల నేతలు కూడా దీనిపై ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఇలాంటి ధోరణి ఎన్నడూ లేదని, కొత్తగా రాజకీయ నాయకుల ఫోటోలను వర్సిటీ హోంపేజీలపై వాడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ నేతలైతే.. స్వార్థ రాజకీయ ప్రచారం కోసమే టీడీపీ వర్సిటీని కూడా వదల్లేదని ఆరోపిస్తోంది. వెంటనే వర్సిటీ సైట్ నుంచి చంద్రబాబు ఫోటో తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికీ ఎస్వీయూ యూనివర్సిటీ హోంపేజీలో చంద్రబాబు ఫోటోనే దర్శనమిస్తుండటంతో.. వర్సిటీ అధికారులు సైతం విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, గతంలో ఇదే యూనివర్సిటీ క్యాంపస్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని నారా లోకేష్ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు వర్సిటీల్లో పుట్టినరోజు జరుపుకోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications