'పవన్ తెలంగాణను చూసి నేర్చుకో, మిలిటెంట్ తరహా ఉద్యమాలు'
అమరావతి: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదని, సినిమా నటుడు అని మాల మహానాడు అధినేత కారెం శివాజీ అన్నారు. ఎంతో ప్రజాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తప్పక వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని చూసైనా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు త్వరలో మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం డిసెంబర్ 7వ తేదీన పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పారు. బీహార్, కాశ్మీర్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన ప్రధాని మోడీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను రక్షించుకోవడానికి త్వరలోనే జాతీయ సదస్సును నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. గ్రామాల్లోని దళితుల భూములను గ్రామ పెద్దలు ఆక్రమించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇంత వరకు శిక్ష పడినట్లు చరిత్రలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!











Click it and Unblock the Notifications