సభకు కమ్యూనిస్టులు ఎందుకు రావడం లేదు : కన్నబాబు
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్మార్చ్పై మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సభకు కమ్యునిస్టులు ఎందుకు వెళ్లడం లేదో సమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు. గత ఎన్నికల్లో కలిసి పోటి చేసిన వారు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ను వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఇక ఇసుక ఆందోళనపై ఒకే దగ్గర స్క్రిప్టు రూపోందిస్తున్నారని, దాన్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ , చంద్రబాబులు ఇద్దరు ఒక్కటే అని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే..ఇసుక కొరతపై లోకేష్ గుంటూరులో దీక్ష చేసే... పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని, పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్కు ప్రజలను తరలించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇసుక కొరతపై రాష్ట్రప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకే ఇరుపార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడైన వరదల్లో కూడ ఇసుకను బయటకు తీసే సాంకెతిక ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అయినా... ఇసుక కొరత ఉందని ప్రభుత్వమే అంగీకరిస్తున్నప్పుడు రాద్దాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఇక గత ప్రభుత్వంలో ఇసుక కొరత ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. చంద్రబాబు హయంలో ఎమ్మెల్యేలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అన్నారు. చంద్రబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అక్టింగ్ చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఎజెండానే పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయపరమైన ఉనికి కోసమే ఇసుక సాకుతో ఆందోళనలు నిర్వహిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications