చికెన్ తేలేదని ఆత్మహాత్య చేసుకొన్న భార్య
పచ్చని కాపురంలో చికెన్ చిచ్చుపెట్టింది. చికెన్ తెమ్మని భార్య కోరినా....చికెన్ తేకపోగా...ఆలస్యంగా ఇంటికి రావడంతో కర్నూల్ కు చెందిన సుజాత గురువారం నాడు ఆత్మహాత్య చేసుకొంది. సుజాత తన భర్త పెంచలయ్యకు చికె
కర్నూల్ :క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలు చివరకు ప్రాణాలకు మీదకు తెస్తున్నాయి. చిన్న కారణాలకే ఆత్మహాత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. చికెన్ తీసుకురాలేదనె ఓ భార్య ఆత్మహాత్య చేసుకొంది.
కర్నూల్ నగరంలోని మద్దూర్ నగర్ కు చెందిన పెంచలయ్య తన భార్య సుజాతతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి పదేళ్ళ క్రితం వివాహమైంది.పెంచలయ్య ఎన్ ఆర్ పేటలోని సురక్షపేటలోని ఆసుపత్రిలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
చికెన్ తీసుకురావాలని సుజాత భర్తను కోరింది.అయితే ఆసుపత్రి నుండి ఇంటికి రావడం పెంచలయ్యకు ఆలస్యమైంది. ఈ విషయమై భార్య బర్తల మద్య గొడవ జరిగింది.గొడవ తీవ్రమైంది.
ఆలస్యంగా ఇంటికి రావడమే కాకుండా చికెన్ తీసుకురాలేదని భర్తపై భార్య సుజాత ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్య భర్తల మద్య మాటామాటా పెరిగింది. ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆమె ఆత్మహాత్య చేసుకొంది.