వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీ రోల్ ఛాన్స్: విలీనం చేయాలని కెసిఆర్‌ను కోరిన డిగ్గీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో పాటు తెరాస విలీనంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శనివారం సాయంత్రం డిగ్గీతో కెసిఆర్‌తో చర్చలు జరిపారు. వారి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చ సాగింది.

విలీనంపై కచ్చితమైన హామీ ఇస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని, ఎటువంటి కష్టనష్టాలెదురైనా పార్లమెంట్‌లో అనుకున్న విధంగా బిల్లు ఆమోదం పొందేలా చేస్తామని డిగ్గీ చెప్పగా, విభజన కచ్చితంగా జరుగుతుందనుకుంటే విలీనానికి తాము సిద్ధమేనని, కెసిఆర్ చెప్పారట.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటేనే ఇరువర్గాలకు మంచిదని తమ పార్టీలో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారని, అయితే విలీనానికి కూడా తమకు అభ్యంతరం లేదని కెసిఆర్ వివరించారని సమాచారం. విభజన ప్రక్రియను బిజెపి పరోక్షంగా అడ్డుకోవడం, సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయడం ఇలాంటి పరిణామాల మధ్య బిల్లు ఆమోదంపై కెసిఆర్ అనుమానం వ్యక్తం చేయగా, ఆ విషయాలు తమకు వదిలేయాలని, విలీనానికి ఒకే చెబితే అంతా సవ్యంగా జరుగుతుందని కెసిఆర్‌కు డిగ్గీ హామీ ఇచ్చారట.

విభజన, విలీనం తర్వాత జాతీయ స్థాయిలో కూడా కీలకపాత్ర పోషించే అవకాశం కల్పిస్తామని కెసిఆర్‌కు కల్పిస్తామని చెప్పారట. పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే విలీనంపై కెసిఆర్ ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు విలీనం వార్తలపై తెరాస స్పందిస్తూ... బిల్లు ఆమోదం పొందేదాక కెసిఆర్ ఆ అంశంపై మాట్లాడరని చెప్పారు.

English summary
Telangana Rastra Samithi chief Kalvakuntla Chandrasekhar Rao on Saturday met AP Congress Party incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X