రేప్.. నోరు మూయించడానికి డబ్బులు.. ఫిర్యాదుతో వెలుగులోకి
విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి.. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు డబ్బులిచ్చి మహిళ నోరు మూయించాలనుకున్నారు.
చిత్తూరు: చంద్రగిరి మండలంలోని ఒక గ్రామంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి.. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు డబ్బులిచ్చి మహిళ నోరు మూయించాలనుకున్నారు.
ఇందుకోసం రూ.20వేలు చెల్లించి మహిళను నోరెత్తకుండా చేశారు. కాగా, గ్రామానికి చెందిన సుధాకర్, వెంకటరెడ్డి ఈ నెల 22న ఓ మహిళ వద్దకు వెళ్లి కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అయితే ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డారు.
ఘటనపై బుధవారం నాడు బాధితురాలు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో నిందితుల తరుపున కొందరు రంగంలోకి అత్యాచార దాడికి రూ.20వేల చెల్లించమని తీర్మానించారు. దీంతో ఎలాంటి పోలీసు కేసులు లేకుండా బయటపడాలని పన్నాగం వేశారు. చివరికి విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరగుతోంది.