సింహాద్రి అప్పన్న లడ్డూలో పురుగులు: ఆందోళనకు దిగిన భక్తులు
విశాఖపట్నం: గురు పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సింహాచలంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆఖరి విడత చందనం సమర్పణ చేశారు.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షణ పూర్తి చేసుకున్న భక్తులు అప్పన్న దర్శనం కోసం బారులు తీరారు. సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఎర్పడింది.
ఇది ఇలా ఉంటే సింహాచలం అప్పన్న ప్రసాదంలో పురుగులు బయటపడ్డాయి. గుడిలో గిరిప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు స్వామి వారి ప్రసాదం లడ్డూలు తీసుకున్నారు. లడ్డూలను విప్పిచూడగా పురుగులు వెలుగు చూడటంతో భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆలయ భక్తులను వివరణ కోరారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, లడ్డూలను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే పంపిణీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
లడ్డూలో పురుగులు వెలుగు చూడటంతో భక్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications