ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్లు లోకేష్ సన్నిహితుడివే..!
ఇటీవల విజయవాడలోని కృష్ణ నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ లోని 67, 68, 69 వ గేట్లకు బలంగా ఢీ కొట్టాయి. దీంతో గేట్ల కౌంటర్ వేయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లు గల బోట్లు..ఇటీవల ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కావాలనే దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేసిందని కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పక్కాగా ప్లాన్ను అమలు చేశారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఢీకొట్టిన 3 బోట్ల యజమాని వైసీపీ నేతవే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై తాజాగా వైసీపీ కౌంటరిచ్చింది.ఆ బోట్ల యజమాని...మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు @naralokesh కు సన్నిహితుడే
— YSR Congress Party (@YSRCParty) September 9, 2024
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను @ncbn ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో… https://t.co/Q3Tu2gr4Aa pic.twitter.com/KsBUI0ICag
ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారని, అందులో రామ్మోహన్...టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తోంది. గతంలో లోకేష్తో కలిసి ఉషాద్రి దిగిన ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులకు లోకేష్ తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫొటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications