హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డు: జగన్‌ను చూసేందుకు నాలుక కోసుకున్నాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఓ అభిమాని తన నాలుకను కోసుకున్నాడు! గురువారం హైదరాబాదులోని లోటస్ పాండులో జగన్‌ను కలిసేందుకు సాల్మన్ రాజ్ అనే అభిమాని వచ్చాడు. అతనిని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అతను తన నాలుకను కోసుకున్నాడు.

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద భద్రత

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

YS Jagan

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీకి చెందిన నాయకులు గురువారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వెంటనే తీర్మానం పెట్టాలని వారు వినతి పత్రం ఇచ్చారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ... తాము శుక్రవారం రోజు క్యాంపు కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర కోసం ధర్నా చేస్తామని చెప్పారు. ఆ సమ్మెలో పార్టీ నాయకులు పాల్గొంటారని చెప్పారు. మరోవైపు 26న సమైక్య శంఖారావానికి పార్టీ సిద్ధమవుతోంది.

English summary
A youth cut his tongue to see YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X