షాక్: రెజీనాను చూడ్డానికి వచ్చి యువకుడు కాలిపోయాడు
హీరోయిన్ రెజీనాను చూడడానికి వచ్చిన ఓ యువకుడు గుంటూరు నగరంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
గుంటూరు: సినీ హీరోయిన్ రెజీనాను చూడటానికి వచ్చిన ఓ యువకుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. అందరూ చూస్తుండగానే అతను సజీవదహనమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో రెజీనా ప్రారంభించబోతున్న నీరూస్ షోరూం వద్దకు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు.
షోరూంకు ఆనుకుని ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని పక్కనే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి విజయ్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఫ్లెక్సీ రాడ్ కరెంట్ తీగలకు తాకి షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మహేష్ అనే యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

అంతలోనే ట్రాన్స్ ఫార్మర్ కారణంగా ఫ్లెక్సీకి మంటలు వ్యాపించి ఆ యువకుడు సజీవ దహనం అయ్యాడు. అతడిని మంటల నుంచి బయటకు లాగేందుకు కర్రల సాయంతో ప్రయత్నించారు. అయితే అతను అప్పటికే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు.
అయితే ఈ ప్రమాద ఘటనలో మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. మృతుడు మహేష్ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందినవాడని చెబుతున్నారు. అతను రెజినాను చూడడానికి వచ్చినట్లు తెలుస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications