Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు, ఎన్నికల ఫలితాల పై భారతి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. కడప జిల్లాలో ఈ సారి ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులు రెండు పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు జగన్ సతీమణి భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. అటు షర్మిల, సునీత కాంగ్రెస్ తరపున ప్రచారం కొనసాగిస్తున్నారు.

భారతి ప్రచారం
ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి పులివెందులలో ప్రచారం ప్రారంభించారు. జగన్ కు గత ఎన్నికల కంటే ఈసారి మంచి మెజారిటీ ఇవ్వాలని పులివెందుల ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన భారతి స్పందించారు. జగన్..రేపు నిన్ను చంపితే ఏమవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన భారతి స్పందించారు.చంద్రబాబు వయసులో పెద్దవారని..అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం తప్పన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని భారతి చెప్పుకొచ్చారు.

YS Bharathi made crucial comments against Chandra Babu Campaign in Pulivenudla

చంద్రబాబు వ్యాఖ్యలు తప్పు
ఒక వ్యక్తిని చంపాలనుకోవటం తప్పని భారతి వ్యాఖ్యానించారు. ప్రజలను మెప్పించుకోవాలని..తొలిగించుకోవాలనుకోవటం సరి కాదన్నారు. ఇక..ప్రచారంలో భాగంగా కుటుంబ సభ్యులు వైఎస్ సమతారెడ్డి, చవ్వా సునీతారెడ్డితో కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు పులివెందులలో మండలాల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలను అప్పగించారు. పులివెందులలో తమకు ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందని భారతి చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి స్పందన బాగుంది అని వివరించారు.

జగన్ చెబితే చేస్తారంతే
సీఎం జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోపై పైనా స్పందించారు. జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని... చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఉంటుందని వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఇవాళ కూడా రొటీన్ గానే ప్రచారానికి వచ్చానని చెప్పారు. అటు కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో భారతి తన ప్రచారంలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక..షర్మిల సైతం త్వరలో పూర్తి స్థాయిలో కడపలో ఎన్నికల ప్రచారం పైనే ఫోకస్ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+