కోర్టుకు జగన్: వచ్చే నెల 12కు విచారణ వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలున్నందున కోర్టుకు రాలేకపోతున్నామని మాజీ మంత్రులు, శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డి, మంత్రి జె. గీతారెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అభ్యర్థన మేరకు సిబిఐ కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.
పది అభియోగ పత్రాలపై విచారణ జరుపుతున్న సిబిఐ కోర్టు ముందు జగన్తో పాటు విజయసాయి రెడ్డి, బిసిసిఐకి చెందిన శ్రీనివాసన్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు శుక్రవారం హాజరయ్యారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో దాదాపుగా అందరికీ బెయిల్ మంజూరైంది. వారంతా జైలు నుంచి విడుదలై బయటే ఉన్నారు. ఈ స్థితిలో కోర్టు విచారణకు వారంతా హాజరు కావాల్సి ఉంటుంది. శానససభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావించారు. కానీ గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది.
కేసులో నిందితులుగా తమ పేర్లను చేర్చడంతో మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. భారీ పరిశ్రమల మంత్రి జె. గీతా రెడ్డి మాత్రం మంత్రిగా కొనసాగుతున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications