వైఎస్ జగన్ ఆర్నెల్లలో 35 వేల కోట్ల అప్పు చేశారు, లక్షా యాభైవేల కోట్ల ఆదాయం పోయింది, వైజాగే దూరం..
సీఎం జగన్ రాసిచ్చినా స్క్రిప్ట్ మీరు చదువుతారా అని బీసీజీ కమిటీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు ముక్కలు అని జగన్ చెబితే.. మీరు ఆడతారా అని మండిపడ్డారు. అలాగే రాష్ట్రానికి 2.25 లక్షల కోట్ల అప్పు ఉందని అసత్యాలు వల్లెవేశారని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 6 నెలల్లోనే 35 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. మళ్లీ అప్పుచేద్దామనుకుంటే పుట్టడం లేదని చెప్పారు. ఎవరికైనా ఆదాయం వస్తే అప్పు ఇస్తారు. లేదంటే ఎవరిస్తారు అని అడిగారు.

భవనాలు లేవా..?
అమరావతి నిర్మించేందుకు ఎక్కువ ఖర్చవుతోందని ప్రభుత్వ పెద్దలు అసత్యాలు చెప్తున్నారు. లక్షా 10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు వేస్తున్నారు...అమరావతిలో సచివాలయం లేదా, అసెంబ్లీని చూడలేదా, హైకోర్టు కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మళ్లీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏముందని అడిగారు.

నిర్మాణాలు లేవా..
లక్షా 10 వేల కోట్ల సాగునీటి ప్రాజెక్టులకు పెడితే సరిపోతుందని ప్రతిపాదించారు. రాజధాని అమరావతిలో రూ.10 వేల కోట్ల పనులు చేసింది కనిపించలేదా అని అడిగారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అగ్రిమెంట్ చేసిన సంగతి మరచిపోయారా అని నిలదీశారు.

కుట్రపూరితంగా..
అమరావతి రాజధాని ఏర్పటయ్యాక ఎస్ఆర్ఎం, విట్, అమిటీ, స్కూళ్లు, హోటళ్లు, ఆస్పత్రులు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైందని.. కానీ వారిని పంపించేసి, కుట్రపూరితంగా రాజధాని మార్పు చేపట్టబోతున్నారని పేర్కొన్నారు. సౌతాఫ్రికా, జర్మనీకి మూడు రాజధానులు ఉన్నాయని చెప్పడం హ్యాస్యాస్పదమని చెప్పారు.

సరికాదు.
ఏపీ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టుకు గుడ్డిగా సంతకం పెట్టారని, ఇదీ మంచి పద్ధతి కాదని బీసీజీ కమిటీకి చంద్రబాబు సూచించారు. తమ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.74 వేల కోట్ల కేటాయించామన్నారు. అమరావతి నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందని అసత్యాలు చెప్పారని.. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి 25 ఏళ్లు పట్టిందనే సంగతి మరచిపోయారా అని అడిగారు. అమరావతిలో 32 వేలకు స్క్వేర్ ఫిట్ పలికిందని, ప్రభుత్వ భూమికి లక్షా యాభై వేల కోట్ల ఆదాయం వచ్చేదని, రాజధాని రైతుల నోట్ల మట్టి కొడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

విశాఖ దూరం
ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించే రాజధాని అందరికీ దూరం అని చంద్రబాబు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలే విశాఖ కన్నా దగ్గర అని పేర్కొన్నారు. కర్నూలు నుంచి 915 కిలోమీటర్ల దూరం అని, అదే కుప్పం నుంచి 950 కిలోమీటర్లు అని పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు వైజాగ్ వెళ్లడం కన్నా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లడమే ఈజీ అని చెప్పారు. కడప జిల్లాకు 730 కిలోమీటర్ల దూరం అని, పులివెందుల 795 కిలోమీటర్లు అని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. తన సొంత జిల్లా, నియోజకవర్గంపై కూడా జగన్ జాలీ చూపించలేదన్నారు. దీనిని తిక్క అనకుంటే ఏం అంటాం అని మండిపడ్డారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications