ఏపి అభివృద్ధి: జైట్లీ, ప్రధాన్తో జగన్ భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సమస్యలు, తూర్పుగోదావరి జిల్లాలోని నగరంలో జరిగిన గ్యాస్ పైప్ పేలేడు వంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రులతో భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము చెప్పిన సమస్యలను ఆర్థిక మంత్రి సావదానంగా విన్నారని తెలిపారు. లోటు బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో సదుపాయాల కొరత ఏర్పడిందని జైట్లీకి అందజేసిన పత్రంలో వివరించామని చెప్పారు.
ఏపికి మౌలిక వస్తువుల తయారీ, ఉన్నత విద్యా, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం పన్ను రాయితీలు కల్పించాలని కోరామన్నారు. ఏపికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీని 15ఏళ్లపాటు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో భేటీ అయ్యారు.
వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సమస్యలు, తూర్పుగోదావరి జిల్లాలోని నగరంలో జరిగిన గ్యాస్ పైప్ పేలేడు వంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు.
వైయస్ జగన్
మంత్రులతో భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము చెప్పిన సమస్యలను ఆర్థిక మంత్రి సావదానంగా విన్నారని తెలిపారు. లోటు బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో సదుపాయాల కొరత ఏర్పడిందని జైట్లీకి అందజేసిన పత్రంలో వివరించామని చెప్పారు.
వైయస్ జగన్
ఏపికి మౌలిక వస్తువుల తయారీ, ఉన్నత విద్యా, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం పన్ను రాయితీలు కల్పించాలని కోరామన్నారు.