ఏపీ సర్కార్కు సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు!: జగన్..
ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ.. రైతులపై లేదని జగన్ విమర్శించారు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదని, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితిని కూడా గమ
అమరావతి: జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసేందుకు ఏపీ అసెంబ్లీ మంగళవారం నాడు సమావేశమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో మిర్చి రైతుల గిట్టుబాటు అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసీపీ తీర్మానాన్ని స్పీకర్ పక్కనపెట్టేయడంతో.. ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.
దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నడుమే జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్రపడింది. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జీఎస్టీకి తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో రైతు సమస్యలపై మాట్లాడుదామంటే ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు.

ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ.. రైతులపై లేదని జగన్ విమర్శించారు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదని, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితిని కూడా గమనించాలని హితవు పలికారు. ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు కేవలం రూ.2కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
రైతులు సమస్యల్లో ఉంటే మిర్చి యార్డ్ మూసేయడమేంటని ప్రశ్నించిన జగన్.. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్ మూసేశారని అన్నారు. మిర్చికి కేంద్రం రూ.5వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications