పట్టిసీమతో మరో మోసం: బాబుపై జగన్(పిక్చర్స్)
కర్నూలు: ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుక్షణం అబద్దాలు చెప్పి మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల సందర్శనకు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం కర్నూలు జిల్లాలోకిప్రవేశించింది.
శ్రీశైలం నియోజకవర్గంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, నందికొట్కూరు నియోజకవర్గంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాలను ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వ్యవసాయం దండగ అని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే రైతులను మోసం చేసేందుకు, తన వ్యక్తిగత ఖజానా నింపుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకువస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీళ్లు రావాల్సి ఉండగా కేవలం 4 వేల క్యూసెక్కులు మాత్రమే వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

వైయస్ జగన్
ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుక్షణం అబద్దాలు చెప్పి మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
రాష్ట్రంలోని ప్రాజెక్టుల సందర్శనకు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం కర్నూలు జిల్లాలోకిప్రవేశించింది.

వైయస్ జగన్
శ్రీశైలం నియోజకవర్గంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, నందికొట్కూరు నియోజకవర్గంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాలను ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.

వైయస్ జగన్
ఆయా ప్రాజెక్టుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.

వైయస్ జగన్
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వ్యవసాయం దండగ అని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే రైతులను మోసం చేసేందుకు, తన వ్యక్తిగత ఖజానా నింపుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకువస్తున్నారని ఆరోపించారు.

వైయస్ జగన్
పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీళ్లు రావాల్సి ఉండగా కేవలం 4 వేల క్యూసెక్కులు మాత్రమే వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

వైయస్ జగన్
గండికోట జలాశయానికి 30 టిఎంసిల నీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ నీరు ఎలా ఇస్తారో చెప్పడం లేదన్నారు.

వైయస్ జగన్
గండికోటకు ఎంత నీరు ఇచ్చారో స్పష్టం చేయాలని అధికారులను నిలదీయగా కేవలం ఒక్క టిఎంసి మాత్రమే ఇచ్చినట్లు చెప్పారన్నారు. పట్టిసీమతో రాయలసీమకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు.
గండికోట జలాశయానికి 30 టిఎంసిల నీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ నీరు ఎలా ఇస్తారో చెప్పడం లేదన్నారు. గండికోటకు ఎంత నీరు ఇచ్చారో స్పష్టం చేయాలని అధికారులను నిలదీయగా కేవలం ఒక్క టిఎంసి మాత్రమే ఇచ్చినట్లు చెప్పారన్నారు. పట్టిసీమతో రాయలసీమకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు.
పట్టిసీమను నిర్మించి ఈ ప్రాంత రైతుల సంక్షేమాన్ని సైతం దెబ్బ తీస్తున్నారన్నారు. ప్రాజెక్టును ఆ ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకుపోతున్నారని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై విడుదల చేసిన జీవోలో రాయలసీమ ప్రస్తావనే లేదని అన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు మేలు జరుగుతుందనన్నారు. పట్టిసీమను హడావుడిగా చేపట్టడం వెనుక ముడుపుల వ్యవహారం ఉందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications