రోహిత్ ఆత్మహత్య: జగన్ ఇలా (పిక్చర్స్), బాబు-కెసిఆర్లను లాగిన శ్రవణ్!
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ బుధవారం వర్సిటీని సందర్శించారు.
విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో మనమందరం ప్రశ్నించుకోవాలన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు.
కాగా, విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రం మూర్ఖంగా వ్యవహరించి రోహిత్ చావుకు కారణమైందన్నారు. విద్యార్థుల సస్పెన్షన్కు దత్తాత్రేయ, రామచంద్ర రావులే కారణమన్నారు. రోహిత్ మృతి పైన రెండు రాష్టాల ముఖ్యమంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తద్వారా ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలను లాగారు. వీసీని సస్పెండ్ చేయాలన్నారు.

నిరసన చేస్తున్న విద్యార్థులతో జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హెచ్సియులో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలుసుకున్నారు.

వైయస్ జగన్ ఆరా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య విషయమై ఆరా తీస్తున్న వైసిపి అధినేత జగన్.

ప్రతిపాదిత స్థూపం ప్రాంతం వద్ద జగన్
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు వేముల రోహిత్ ప్రతిపాదిత స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

మాట్లాడుతున్న జగన్
వేముల రోహిత్ బాధాకరమని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఆత్మహత్యపై మనలను మనం ప్రశ్నించుకోవాలన్నారు.

హెచ్సియు
హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి బుధవారం వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి విద్యార్థులను పరామర్శించారు.

హెచ్సియు
హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి బుధవారం వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన విద్యార్థులు.

ఏబీవీపీ ధర్నా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక నిందితులు తమ కార్యకర్తలేనన్న ఆరోపణలపై ఏబీవీపీ బుధవారం మండిపడింది.

ఏబీవీపీ ధర్నా
'సేవ్ హెచ్సియు' పేరిట సరికొత్త రీతిలో ఏబీవీపీ హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగింది. రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏబీవీపీ ధర్నా
ట్యాంక్ బండ్ పైన ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలు... కుల, శవ రాజకీయాలు వీడాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications