అమరావతిలో లేఖల కలకలం - జగన్ తాజా ప్లాన్ ఇదేనా ?
అమరావతి రాజధానిలో ఎన్నికల వేళ మరో కలకలం రేగుతోంది. ఇన్నాళ్లూ మూడు రాజధానులను తెరపైకి తెస్తూ అమరావతిలో అభివృద్ధి పనుల్ని నిలిపేయడంపై జరుగుతున్న చర్చ కాస్తా మరోవైపుకు మళ్లుతోంది. దీనికి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. అసలే ఎన్నికల వేళ ప్రభుత్వం సీఆర్డేయే సాయంతో ఏ ప్లాన్ అమలు చేయబోతోందన్న దానిపై ఇక్కడి రైతుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు అప్పట్లో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ప్లాట్లు కేటాయించింది. ఈ ప్లాట్లు ఇంకా పూర్తిస్ధాయిలో రైతులకు అందనే లేదు. అంతలోనే కేటాయించిన ప్లాట్ల విషయంలో సీఆర్డీయే తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఫ్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు పంపుతోంది. దీంతో అసలు ఈ ప్లాట్ల రద్దు వెనుక ఏముందని చర్చించుకుంటున్నారు. సీఆర్డీయే నిర్ణయం వెనుక ఏముందనే దానిపై ఆరా తీస్తున్నారు.

అమరావతి రైతులకు సీఆర్డీయే లేఖలు పంపుతున్న వాటిలో ప్రధానంగా న్యాయవివాదాలు ఉన్న చోట్ల ఫ్లాట్లు ఉన్నవారే ఉన్నారు. దీంతో ఆయా న్యాయవివాదాల పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ ప్లాట్లు రద్దు చేసుకోమని కోరుతుందా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ ఫ్లాట్లు రద్దు చేసుకుంటే ప్రత్యామ్నాయంగా మరో చోట ఫ్లాట్లు కేటాయిస్తామని సీఆర్డీయే ప్రతిపాదిస్తోంది. అయితే ఇలా ప్రత్యామ్నాయంగా ఎక్కడ, ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ లేదు.
ఈ ప్రాంతంలో మొత్తం దాదాపు 3500 మంది రైతులకు సీఆర్డీయే ఇలా లేఖలు పంపుతోంది. అయితే ఈ లేఖలకు సమ్మతి తెలిపేందుకు రైతులు ముందుకు రావడం లేదు. కానీ నాలుగేళ్లుగా ఇలాంటి వివాదాస్పద ప్లాట్లపై తాము అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం చూపని ప్రభుత్వం..ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రతిపాదన చేయడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ కోణంలో చూస్తే అమరావతి ప్రాంతంలో రాజధాని తరలింపుతో ఇక్కడి రైతులు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల కోణంలో తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు స్ధానికంగా ఏ మేరకు సహకారం లభిస్తుందన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఉన్నంతలో అమరావతిలో వివాదాలకు చెక్ పెట్టి ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications