మలుపు తిరిగిన అమరావతి భూసేకరణ..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాజధాని అమరావతి మలి విడత భూసేకరణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఇప్పుడున్న భూములకు అదనంగా మరో 44,000 ఎకరాలను సేకరించడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంటోంది.
దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా తిష్ట వేసిందని, పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని అన్నారు. తొలి విడతలో ప్రభుత్వ భూములతో కలిపి 54,000 ఎకరాల్లో అభివృద్ధి జరిగిపోయిందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని అన్నారు. ఇంకా అక్కడ భూమి లేనట్లుగా, అదనంగా మరో 44,000 ఎకరాలు సేకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు.

"మున్సిపాలిటీ కావాలా? అంతర్జాతీయ రాజధాని కావాలా?" అని చంద్రబాబు నేరుగా ప్రజలను బెదిరించేలా అడుగుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. 54,000 ఎకరాల్లో మున్సిపాలిటీ గురించే ఇప్పుడు మాట్లాడటమేంటని ఆమె అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల రైతులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. అన్నీ పోగా- ఇప్పుడు 700 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని మంత్రి నారాయణ చెబుతున్నారని గుర్తు చేశారు.
అసలు ఎంత భూమిని ఎవరికి కేటాయించారు? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు విభజించి ఇచ్చారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాజధానికి సంబంధించిన 54,000 ఎకరాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. మింగడానికి మెతుకు లేదు గాని, ఇన్ని వేల కోట్ల అవసరమా? అని చెప్పారు. అమరావతిపై చంద్రబాబుకే చిత్తశుద్ధి లేకపోతే, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటిని అన్నారు.
భూములు ఇచ్చిన వారికీ న్యాయం చేయకుండా, ఇప్పుడు కొత్తగా మళ్లీ రైతులను బాధితులుగా మారుస్తారా? అని షర్మిల చెప్పారు. అమరావతి తొలి దశ భూములపై శ్వేతపత్రం ఇవ్వాలని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రెండో విడత భూ సేకరణకు తాము వ్యతిరేకమని ఆమె తేల్చి చెప్పారు. అమరావతి నిర్మాణం కేంద్రం బాధ్యత అని, దాని నుంచి తప్పుకుందని అన్నారు. 11 ఏళ్లలో కేంద్రం ఇచ్చింది 1,500 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు.
-
YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా?












Click it and Unblock the Notifications