YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు- 24న విచారణకు రమ్మంటూ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్ కు బదిలీ అయిన ఈ కేసు విచారణ కోసం ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులిచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. కడప నుంచి హైదరాబాద్ కు ఈ కేసు విచారణ బదిలీ అయిన నేపథ్యంలో వేగం పెంచిన సీబీఐ.. ఇప్పటికే నిందితుల్ని మరోసారి విచారించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓసారి విచారించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మళ్లీ విచారణకు పిలిచింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
గత నెల 28న వివేకా కేసులో తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డిని దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మరోసారి అవసరమైతే పిలుస్తామని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అప్పుడు చెప్పిన ప్రకారమే ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 24న హైదరాబాద్ లో విచారణకు రావాలని కోరింది. వైఎస్ అవినాష్ రెడ్డికి ఈసారి సీబీఐ.. వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. ఈనెల 24న మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

వివేకా కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితుల్ని సీబీఐ అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు బెయిల్ తెచ్చుకున్నారు. మిగతా వారిని సీబీఐ కోర్టు తాజాగా చంచల్ గూడ జైలుకు పంపింది. వీరిని కడప జైలు నుంచి తెచ్చి సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత వారిని చంచల్ గూడకు పంపారు. త్వరలో సీబీఐ కోర్టు మరోసారి ఈ కేసులో విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications