గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, ఆశించిన పదవి దక్కలేదని ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన అనసూయ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్ష పదవిని తనకు ఇస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, ఆ పదవిని వేరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నిద్ర మాత్రలు మింగారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

కోటి రూపాయల చందనం పట్టివేత

చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం చెరకువారిపల్లి వద్ద కోటి రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.

బస్సు బోల్తా

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మామండూరు వద్ద ఆర్టీస్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

English summary
YSR Congress Party Guntur district woman leader tried to commit suicide on Tuesday eveing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X