ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది రెండుసార్లే..!!
Markapuram Assembly round up: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు లోకసభ పరిధిలోని ఉండే జనరల్ నియోజకవర్గం మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. తెలుగుదేశం పార్టీ ఉనికి అంతంత మాత్రమే ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ- టీడీపీ మధ్య హోరాహోరి పోరు సాగే అవకాశం ఉంది.
మార్కాపురం, కొనకమిట్ల, పొదిలి, తర్లుపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 1951లో నియోజకవర్గాల పునర్వ్వవస్థీకరణలో ఏర్పడింది. సంఖ్యాపరంగా గానీ, రాజకీయంగా గానీ రెడ్డి సామాజిక వర్గీయులదే పైచేయి. వారి తరువాత యాదవ, ముస్లిం, వైశ్య సామాజిక వర్గాలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎస్సీ, తెలగ, కాపు, కమ్మ కులస్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటారు.

1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు రెడ్లే గెలిచారు. దీన్ని బట్టి- మార్కాపురం నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి ఎంత పట్టు ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా నజీర్ బేగ్ అనే ముస్లిం నాయకుడు విజయం సాధించారు.
టీడీపీ ఆవిర్భవించక ముందు ఆరు ఎన్నికలు జరగ్గా, కృషికార్ లోక్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ రెండుసార్లు చొప్పున గెలిచాయి. సీపీఐ ఒకసారి విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా పూల సుబ్బయ్య పాగా వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరునే పెట్టింది ప్రభుత్వం. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు.
టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిది ఎన్నికలు జరగాయి. టీడీపీ 1983, 2009 ఎన్నికల్లో మాత్రమే మార్కాపురాన్ని సొంతం చేసుకోగలిగింది. కాంగ్రెస్ నాలుగుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, వైఎస్ఆర్సీపీ రెండుసార్లు గెలిచాయి. 1983లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన వీవీ నారాయణరెడ్డి.. మంత్రిగా పని చేశారు. అత్యధికంగా కుందూరు పెద్ద కొండారెడ్డి నాలుగు సార్లు గెలిచారు.
2009లో టీడీపీ అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి.. కాంగ్రెస్కు చెందిన కేపీ కొండారెడ్డిపై 9,054 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి జంకె వెంకటరెడ్డి చేతిలో 9,802 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డి .. కందులను 18,667 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఈ ఎన్నికల్లో కుందూరు నాగార్జునరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదు. ఆయనను గిద్దలూరుకు పంపించింది. గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబును మార్కాపురం ఇన్ఛార్జీగా నియమించింది వైసీపీ.
టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కందుల నాగార్జునరెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది సస్పెన్స్గా మారింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు 2019 ఎన్నికల్లో 70,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు మార్కాపురంలోనూ అదే స్థాయిలో విజయాన్ని ఆశిస్తోన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications