వైజాగ్ స్టీల్ ఉద్యోగులదే తప్పా? చంద్రబాబు కామెంట్స్ పై వైసీపీ ఫైర్..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు తాజాగా సీఐఐ సదస్సు సందర్బంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా పనితీరు మెరుగుపర్చుకోకుండా ప్రైవేటీకరణ ఆపడం లేదంటూ ఉద్యోగులు ఒత్తిడి పెంచడాన్ని తప్పుబడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టింది.
గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోతోందని దుమ్మెత్తి పోసిన చంద్రబాబు... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యూటర్న్ తీసుకున్నారని వైసీపీ మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ, ఒకవైపు ప్రజలను మభ్య పెడుతూ, మరోవైపు ఆ దిశలో కేంద్ర చర్యలను పూర్తిగా సమర్థిస్తున్నారన్నారు. అందుకు చంద్రబాబు తాజా వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

'పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?' అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయని వారు విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కూడా దారుణంగా వంచించారని, నిలువుగా దగా చేశారని వారు ఆరోపించారు.
అదే విశాఖ స్టీల్ ప్లాంట్కు కొన్నాళ్ల క్రితం కేంద్రం ప్యాకేజీ ఇస్తే, అది తమ ఘనత అన్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని, తమ చొరవ వల్లే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని డబ్బా కొట్టుకున్నారని, నిజానికి కేంద్రం ఆ నిధులు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించడానికా? లేక ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకా? అన్నది చూస్తే.. రెండోదే ఖాయంగా తేలుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో సీఎం చంద్రబాబు ఇసుమంతైనా చొరవ చూపడం లేదన్నారు. పైగా తన సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారని, అయినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

తమ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా చంద్రబాబు కానీ, పవన్కళ్యాణ్ కానీ నోరు మెదపడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. పరోక్షంగా లక్షలాదిపై ప్రభావం చూపుతున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో తీపి తీపి మాటలతో నమ్మించిన కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రప్రజలను నిండా ముంచేశారన్నారు. కేంద్రంతో కలసి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కళ్ల ఎదుటే ఉరి తీస్తున్నారన్నారు.
-
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications